వాటర్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్

Telugu Lo Computer
0


రిలయన్స్ వాటర్ రంగంలో అడుగుపెట్టి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సుమారు రూ. 20 వేల కోట్ల విలువైన ఈ మార్కెట్‌లో రిలయన్స్ తన కొత్త బ్రాండ్‌లైన కాంపా ష్యూర్. అతి తక్కువ ధరకే వాటర్ బాటిల్ తీసుకురానుంది. కాంపా ష్యూర్, ఇండిపెండెన్స్ వాటర్ బ్రాండ్లు మార్కెట్‌లో ఉన్న వాటి కంటే 20-43 శాతం తక్కువ ధరలకు విక్రయించేందుకు రిలయన్స్ సిద్ధమైంది. ఈ వ్యూహం డ్రింకింగ్ వాటర్ రంగంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది. రిలయన్స్ తీసుకొచ్చిన ధరలు, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బిస్లెరి, ఆక్వాఫినా, కిన్లీ వంటి కంపెనీల కంటే 20శాతం నుండి 43శాతం వరకు తక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో మొదలైన కాంపా ష్యూర్ బ్రాండ్‌.. అక్టోబర్ నాటికి దేశమంతటా అందుబాటులోకి రానుంది. ఈ ధరల తగ్గింపు వలన ప్రజలకు తక్కువ ధరకే మంచి నీరు లభిస్తుంది. జియో, కాంపా కోలా ఫార్ములా: రిలయన్స్ గతంలో టెలికాంలో జియోతో కూల్ డ్రింక్ రంగంలో తక్కువ ధరలకే కాంపా కోలాను తీసుకొచ్చింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు వాటర్ వ్యాపారంలో అమలు చేస్తోంది. నీటి సరఫరా సరిగా లేకపోవడం, జనాభా పెరగడం వంటి కారణాల వలన బాటిల్ వాటర్ అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో ఈ మార్కెట్ 40-45శాతం పెరిగింది. ప్రస్తుతానికి బిస్లెరి 36శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ ధరల యుద్ధం కారణంగా మార్కెట్‌లో పెద్ద మార్పులు వస్తాయి. బిస్లెరి, కోకా-కోలా, పెప్సికో వంటి కంపెనీలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి తమ ధరలను తగ్గించవలసి లేదా కొత్త ఆఫర్‌లను ప్రకటించవలసి వస్తుంది. అయితే పెద్ద పంపిణీ నెట్‌వర్క్, తయారీ సౌకర్యాలు రిలయన్స్‌కు సవాలుగా ఉండవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)