జార్ఖండ్లోని హజారీబాగ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ మృతి చెందాడు. ఆపరేషన్ 'కగార్'లో భాగంగా ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో సహదేవ్తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతి చెందిన సహదేవ్పై రూ. కోటి రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
జార్ఖండ్లో భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి
September 15, 2025
0
Tags