జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

Telugu Lo Computer
0


జార్ఖండ్‌లోని హజారీబాగ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ మృతి చెందాడు. ఆపరేషన్ 'కగార్'లో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సహదేవ్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతి చెందిన సహదేవ్‌పై రూ. కోటి రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)