జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

Telugu Lo Computer
0


మ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం ఆపరేషన్లు కొనసాగిస్తోంది. కిస్త్‌వాడ్‌లో పలువురు ఉగ్రవాదులు నక్కినట్లు దళాలకు సమాచారం అందడంతో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో దుల్‌ జనరల్‌ ఏరియాలో ఉగ్రవాదులు, దళాలకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వైట్‌నైట్‌ కోర్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. పూర్తిగా పర్వత ప్రాంతమైన కిస్త్‌వాడ్‌లో టెర్రరిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం అందినట్లు సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం భారీగా కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు కుల్గాంలో అపరేషన్‌ అఖల్‌ పదవ రోజుకు చేరింది. వీరమరణం పొందిన లాన్స్‌నాయక్‌ ప్రీత్‌పాల్‌ సింగ్‌, సిపాయ్‌ హర్మీందర్‌ సింగ్‌కు చినార్‌ కోర్‌ నివాళి అర్పించింది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని పేర్కొంది. పారా కమాండోలు, రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసు బలగాలు హెలికాఫ్టర్లు, డ్రోన్లు, ఇతర నిఘా పరికరాల సాయంతో ఆ ప్రదేశాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇక్కడ రాత్రివేళల్లో చూసే థర్మల్‌ ఇమేజింగ్‌ పరికరాలను కూడా తీసుకొచ్చారు. గత రెండువారాల్లో భద్రతా దళాలు నాలుగు ఉగ్ర ఏరివేత ఆపరేషన్లు చేపట్టాయి. పహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్‌ మహాదేవ్‌తోనే ఇది మొదలైంది. ఇటీవలే ఆపరేషన్‌ శివ్‌శక్తిని చేపట్టి ఇద్దరు ఉగ్రవాదులను అంతం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)