మోడీని గద్దె దింపేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు !

Telugu Lo Computer
0


బీహార్‌లోని సంసారంలో ఆదివారంనాడు జరిగిన విపక్ష ర్యాలీలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీని అధికారం నుంచి తొలగించేంత వరకూ ప్రజల ఓట్లు, హక్కులు, స్వేచ్ఛకు, చివరకు రాజ్యాంగానికి కూడా భద్రత లేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని, అలాంటి వ్యక్తులను ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి పొడగటం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు. 'మీ వాళ్లెవరూ స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లలేదు. ఉద్యోగాలు కావాలంటూ మీవాళ్లు బ్రిటిష్ వారికి దరఖాస్తులు చేసుకున్నారు. మేము వాళ్లతోనే ఉంటామని కూడా తెగేసి చెప్పారు. అలాంటి వ్యక్తుల పేర్లను ఎర్రకోట నుంచి ప్రధాని ప్రస్తావించడమంటే దేశ స్వాతంత్ర్య కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మలకు మీరెలాంటి సమాధానమిస్తారు' అని ఖర్గే నిలదీసారు. ఆ కారణంగానే మోడీ చాలా ప్రమాదకరమైన వ్యక్తని తాను చెప్పగలనని అన్నారు. ప్రధాని మోడీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, యువత ఉద్యోగాలు, రైతుల నుంచి ఎంఎస్‌పీని మోడీ దోచుకుంటున్నారని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)