2025 మహిళల వన్డే వరల్డ్ కప్లో బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం మొత్తం నాలుగు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్లలో భారత్-శ్రీలంక మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్, ఒక సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఉన్నాయి. అయితే, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు ఇంకా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఈ మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన అనుమతి లభించలేదు. దీనితో ఈ కీలకమైన మ్యాచ్లు వేరే వేదికలకు తరలిపోతాయేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఒక విషాద సంఘటనే దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది జూన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ గెలిచినప్పుడు, దాని విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం చుట్టూ భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన స్టేడియం భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. దీని తర్వాత, పెద్ద ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి వెనుకాడటంతో, మహారాజా టీ20 టోర్నమెంట్ను కూడా బెంగుళూరు నుంచి మైసూర్కు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు, మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
బెంగుళూరులో 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లు రద్దు ?
August 08, 2025
0
Tags