లీడ్స్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు : రిషబ్ పంత్ అరుదైన రికార్డు

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ, శుభ్‌మన్ గిల్ సెంచరీతో అజేయంగా నిలవడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. హెడింగ్లీలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20న ప్రారంభమైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ అతని నిర్ణయం పూర్తిగా తప్పు అని నిరూపించబడింది. భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ (101) సాధించగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీ సాధించి 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరితో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం నిరాశపరిచిన తర్వాత రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌లో మొదటి టెస్ట్ మొదటి రోజునే మెరిశాడు. రిషబ్ పంత్ మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించాడు. రిషబ్ పంత్ 65 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మొదటి రోజు రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ ఒక పెద్ద ఘనతను సాధించాడు. 27 ఏళ్ల రిషబ్ పంత్ లీడ్స్‌లో మొదటి రోజు తన టెస్ట్ కెరీర్‌లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన రెండో అత్యంత వేగవంతమైన వికెట్ కీపర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ 76 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే 63 ఇన్నింగ్స్‌లతో రిషబ్ పంత్ కంటే ముందు ఉన్నాడు. దీంతో రిషబ్ పంత్ ఎంఎస్ ధోని ప్రత్యేక రికార్డును కూడా బద్ధలు కొట్టాడు. సేన(SENA-సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరు మీద ఉంది. ఎంఎస్ ధోని ధోని 1731 పరుగులు చేశాడు. ఇప్పుడు రిషబ్ పంత్ 1746 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్. గతంలో ఎంఎస్ ధోనీ, ఫరూక్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణి ఈ ఘనతను సాధించారు

Post a Comment

0Comments

Post a Comment (0)