విమానం మెడికల్ కళాశాలపై పడి 20 మంది మెడికోల మృతి

Telugu Lo Computer
0


గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం  ఒక మెడికల్ కళాశాలపై పడింది. ఆ సమయంలో మెడికోలు భోజనం చేస్తున్నారు. మొత్తం ఇరవై మంది మెడికోలు భోజనం చేస్తుండగా విమానం కుప్పకూలడంతో ఆ భవనం మొత్తం కూలిపోయింది. మధ్యాహ్నం కావడంతో మెడికోలు అందరూ భోజనానికి క్యాంటిన్ లో ఉన్నారు. ఆ సమయంలో విమానం కూలడంతో శిధిలాల కింద పడి ఇరవై మందికి పైగా మెడికోలు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. అనేక మంది మెడికోలు గాయడపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)