పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

Telugu Lo Computer
0


రాజస్తాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్‌ ఖాన్‌ మగళియార్‌ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. సకూర్‌ ఖాన్‌ స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా సకూర్‌ ఖాన్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్‌ బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి. ఈ సందర్బంగా ఎస్పీ సుధీర్‌ చౌధ్రీ మాట్లాడుతూ సకూర్‌ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. అతడికి పాక్‌ దౌత్య కార్యాలయంతో సంబంధాలపై కూడా సందేహాలున్నాయి. సకూర్‌ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి సమాచారం అందింది. దీంతో వాటిని ప్రశ్నించి.. నిర్ధారించుకునేందుకు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. సకూర్‌ ఖాన్‌ ఫోన్‌లో పలు పాకిస్తానీ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి గురించి సంతృప్తికరమైన వివరణ మాత్రం అతడి నుంచి రావడం లేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు అంగీకరించాడు. ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. కాకపోతే కొన్ని ఫైల్స్‌ను అతడు డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. ఇక ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలపై దృష్టిసారించారు. ఇదిలా ఉండగా సకూర్‌ ఖాన్‌ స్వస్థలం పాక్‌ సరిహద్దుల్లోని జైసల్మేర్‌ జిల్లా బరోడా గ్రామంలోని మంగళియార్‌ ధాని. ఇతడు గత రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేయడం సంచలనంగా మారింది. సదరు మాజీ మంత్రిది కూడా ఇదే గ్రామం కావడం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)