న్యూ ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ దేబేంద్ర ప్రధాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 84. ఓడిశాలోని తాళచేరు లో 1941 జూలై 16 న జన్మించారు. తాళచేరు లో వైద్యాధికారిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆయన 1973 లో సేవల నుండి రాజీనామా చేసి సామాజిక కార్యకలాపాలు మరియు వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. 1980 లో బీజేపీలో చేరిన డా. ప్రధాన్, తాళచేరు బ్లాక్ అధ్యక్షుడిగా, తరువాత ధేనకనల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సేవలు ఇచ్చారు. మూడు సార్లు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డా. ప్రధాన్ 1998-99 సంవత్సరాలలో 12వ లోక్సభకు దేవగఢ్ నుండి ఎన్నికయ్యారు. కేంద్ర రవాణా మంత్రిగా పనిచేశారు. 1999 లో 13వ లోక్సభకు (రెండవ టర్మ్) 13 అక్టోబర్ 1999 నుండి 27 మే 2000 వరకు కేంద్ర రవాణా మంత్రిగా, 27 మే 2000 నుండి కేంద్ర వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కుమారుడు.
కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ కన్నుమూత
March 17, 2025
0
Tags