ఛత్తీస్‌గఢ్ లో 15 మంది మావోయిస్టుల మృతి

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా గోగుండా కొండపై ఉపంపల్లి ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మరణించారు. మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవానులు పాల్గొన్నారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)