మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు !

Telugu Lo Computer
0

మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది. వంజెం కేషా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందినది. చిన్నతనం నుంచే చైతన్య నాట్య మండలిలో పని చేసిన ఆమె, మావోయిస్టు పార్టీలోని సభ్యులతో పరిచయం పెంచుకుంది. 2017లో పామెడ్‌ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరింది. 2019లో కేషా అబుజ్‌మడ్ ప్రాంతానికి బదిలీ అయ్యింది. అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి (కొసా)కు ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమితమైంది. 2021లో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ఆమెను ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి కల్పించింది. 2022 డిసెంబర్ వరకు ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్‌గా పని చేసింది. ఈ కాలంలో మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ (ప్రస్తుతం మహారాష్ట్ర జైలులో ఉన్నాడు)ను వివాహం చేసుకుంది. ఉత్తర బస్తర్ డివిజన్‌లో కొంతకాలం సేవలందించిన అనంతరం, 2024 ఏప్రిల్‌లో మళ్లీ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలు చేపట్టింది. వంజెం కేషాపై  ₹4 లక్షల రివార్డు ఉంది. పోలీసుల ఎదుట లొంగడానికి పలు కారణాలు ఉన్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కఠినంగా మారిన పోలీసులు దాడులు: వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టుల సంఖ్య తగ్గుతోంది. మావోయిస్టుల తీరుపై స్థానిక ప్రజల ఆగ్రహం పెరిగింది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస పథకాలు అందిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)