మధ్యప్రదేశ్లోని ఆధాత్మిక నగరాల్లో మద్య నిషేధం నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు. త్వరలోనే దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. త్వరలో మద్య నిషేధం ప్రకటిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, బడ్జెట్ సమావేశాలు కూడా దగ్గర పడుతున్నందున మద్యం పాలసీలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. సాధువులు కోరారని, ఆ తర్వాత నిషేధాజ్ఞలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మద్య నిషేధంపై తమ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని సీఎం మోహన్ యాదవ్ అన్నారు. మతపరమైన ప్రదేశాలు ఉన్న ప్రతిచోటా ఇది అమలు చేయబడుతుంది. మతపరమైన ప్రాంతాలు, ఆలయ ప్రాంతాలకు వెలుపల ఉన్న నగరాల్లో మాత్రమే మద్యం విక్రయించవచ్చని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్లోని ఆధాత్మిక నగరాల్లో మద్య నిషేధం ?
January 13, 2025
0
Tags