కర్ణాటకలోని హుబ్బళ్లిలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్జోషి మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మం ఒక విధంగా డెంగ్యీ, కలరా లాంటివని తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల వేళ మాత్రమే హిందుత్వం అనేది కాంగ్రెస్కు గుర్తుకు వస్తుందన్నారు. హిందుత్వంపై రాహుల్గాంధీ, డీకే శివకుమార్లు తమ నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. హిందుత్వం పట్ల కోట్లాది మంది విశ్వాసంతో ఉన్నారన్నారు. కానీ అధికారం కోసం కాంగ్రెస్ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తుందన్నారు. సనాతన ధర్మం అనేది జీవన విధానమన్నారు. రాజ్యాంగంలోని 85వ కాలం ప్రకారం రాష్ట్రపతికి నివేదిస్తామన్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలోనే ప్రారంభం అవుతాయని కీలక అంశాలపై నిర్ణయం ఉంటుందన్నారు.
అధికారం కోసం కాంగ్రెస్ రంగులు మారుస్తుంది !
September 08, 2023
0
Tags