ఎయిర్ ఇండియా సిబ్బందిపై ప్రయాణికుడి దాడి !

Telugu Lo Computer
0


గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరి ఎయిర్ ఇండియా AI882 విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి సిబ్బందితో గొడవకు దిగాడు. మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇతర సిబ్బందిపై దుర్భాషలాడాడు. మందలించిన తోటి ప్రయాణికుడిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనిపై అసహనం వ్యక్తం చేసిన విమాన సిబ్బంది  ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్ కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)