ఢిల్లీ లిక్కర్​ కేసులో నాల్గవ చార్జిషీట్​ దాఖలు !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) నేడు నాల్గవ చార్జిషీట్​ దాఖలు చేసింది. పలు అభియోగాలతో కూడిన పత్రాలను రౌస్​ అవెన్యూ కోర్టుకు అందజేసింది. ఇందులో బాగంగా కోర్టు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్​ నేత మనీశ్​ సిసోడియాకు మరోసారి నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ గత చార్జిషీట్లలో మోపిన అభియోగాలనే ఈడీ మరోమారు ప్రస్తావించింది. లిక్కర్​ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను పలుమార్లు ప్రశ్నించగా, ఈ కేసులో ప్రశ్నించిన 51 మంది వివరాలను, వారి సమాధానాలను మరోమారు అభియోగ పత్రంలో ఈడీ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)