బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక !

Telugu Lo Computer
0


బ్రిక్స్‌ దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోసారి హెచ్చరించారు.  బ్రిక్స్‌ దేశాలు తమ స్వంత కరెన్సీ ఉపయోగిస్తే, అమెరికాతో వ్యాపారం చేయడంలో పెద్ద సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. 'మీరు వ్యాపారం చేయాలనుకుంటే, అది డాలర్లలోనే జరగాలి' అని ఆయన చెప్పారు. అలా కాకపోతే, ఎగుమతులపై వంద శాతం ట్యాక్స్‌ తప్పదని ఆయన గట్టిగా చెప్తున్నారు. 'అమెరికా ఫస్ట్' నినాదంతో ముందుకెళ్లే ట్రంప్‌ ఇప్పుడు బ్రిక్స్‌ దేశాలను టార్గెట్ చేశారు.అక్రమ వలసలను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకున్న ట్రంప్‌ ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంపై తన నియంత్రణను పెంచుకుంటున్నారు. ఆయన ప్రకటన ప్రకారం, ఈ దేశాలు డాలర్‌ను పక్కన పెట్టాలనుకుంటే, ఆర్ధిక కష్టం తప్పదని ఆయన తీవ్రంగా చెప్పారు.బ్రిక్స్‌ దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికా. వీటితో పాటు, ఇండోనేషియా, ఇరాన్, ఈథియోపియా, అరబ్ ఎమిరేట్స్‌ కూడా ఈ కూటమిలో చేరాయి.ఈ దేశాలు గత 16 సంవత్సరాలుగా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. 2023లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డాలర్ ఆధిపత్యానికి ఎటువంటి ప్రతిఘటన చూపించాడు. ఇప్పుడు ట్రంప్‌ ఇందుకు ప్రతిస్పందించి, డాలర్‌ను తప్పించడం అంటే ఆర్థిక మాంద్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.'మీ దేశం, మీ కరెన్సీ!' అని ట్రంప్‌ అన్నారు, అయితే తమ దేశంలో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు మాత్రం డాలర్లలోనే జరగాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)