గుంటూరు జనరల్ హాస్పిటల్‌కు రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చిన డాక్టర్‌ ఉమ గవిని

Telugu Lo Computer
0


డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు. మొత్తం రూ.20 కోట్ల  ఆస్తిని జీ.జీ.హెచ్‌ లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్టు గా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లిన సూపర్ స్పెషలిటీ డాక్టర్‌ ఉమ తన జన్మభూమికి, తాను చదువుకున్న నగరానికి సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఆధునిక భారతంలో దాతృత్వానికి ఓ అద్భుత ఉదాహరణగా నిలిచింది.


Post a Comment

0Comments

Post a Comment (0)