వీధి దీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడం పైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఐసీసీసీలో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీలను నుంచి టెండర్స్ పిలవాలని, వీధి దీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడం పైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం అన్నారు. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని తెలిపారు. తెలంగాణలోని అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని, ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలన్నారు. గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని, వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్‌లకే ఉందన్నారు. దానిని ఎంపీడిఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి పోల్ సర్వే చేయించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)