ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక నేతలతో కేసీఆర్‌ భేటీ

Telugu Lo Computer
0


ర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రులు జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా పలువురు గులాబీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కవిత సస్పెన్షన్‌ తర్వాత పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. గత మూడు రోజులుగా బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ఘోస్‌ కమిషన్‌పై సీబీఐ విచారణతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)