ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు. భారత్ తో యూరప్, పశ్చిమ దేశాలు గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని స్టబ్ స్పష్టం చేశారు. భారతపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. నా సందేశం నా యూరోపియన్ మిత్రదేశాలకు మాత్రమే కాదు, అమెరికాకు కూడా అని ఆయన తెలిపారు. మనం గౌరవప్రదమైన విదేశాంగ విధానాన్ని అనుసరించకపోతే, ముఖ్యంగా భారతదేశం వంటి గ్లోబల్ సౌత్తో, ఈ ఆటలో మనం ఓడిపోతాము. కాబట్టి చైనాలో జరిగే సమావేశం మనందరికీ ఏ ప్రమాదం పొంచి ఉందో గుర్తుచేసుకోవడానికి ఒక అవకాశం అని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ గురువారం ట్రంప్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. ట్రంప్ విధానాల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా, చైనాలకు దగ్గరవుతున్నారని ఆయన అన్నారు. ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలను దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్తున్నారని ఆయన X లో పోస్టు చేశారు.
భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలి !
September 05, 2025
0
Tags