కొత్త హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన కర్నాటక మంత్రి సతీష్‌ జార్కిహొళి !

Telugu Lo Computer
0


ర్నాటకలోని బెళగావి జిల్లాకు చెందిన మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త సతీష్‌ జార్కిహొళి  సొంతంగా పర్యటనల కోసం కొత్త హెలికాప్టర్‌ను కొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరగా ప్రయాణాలకు హెలికాప్టర్‌ అయితే బాగుంటుందని అనుకున్నారు. అగస్టా కంపెనీ హెలికాప్టర్‌ను బెంగళూరు జక్కూరు ఏరోడ్రోమ్‌లో బిగిస్తున్నారు, దీనిని జర్మనీ నుంచి తెప్పించారు, ఆ పనులను ఆయన పరిశీలించి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కొత్త చాపర్‌ ఎగరడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతతో కూడినది, డబుల్‌ ఇంజిన్‌లు ఉంటాయి. ఇద్దరు పైలట్‌లు ఇందులో ఉంటారు అని తెలిపారు. దీని విలువ రూ.20కోట్లు గా తెలిసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)