హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా చేజిక్కించుకున్నట్లు ఉగాండాకు చెందిన మధ్వాని గ్రూప్ కంపెనీ ఇండిపెండెంట్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. కొత్తగా ఏర్పడిన హెచ్ఎన్జీఐఎల్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ కొనుగోలు ప్రక్రియ పారిశ్రామికవేత్తలు కమ్లేష్ మాధ్వాని, శ్రై మాధ్వాని నేతృత్వంలో జరిగింది. సెర్బరస్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఆర్థిక మద్దతు లభించిందని ఐఎన్ఎస్సీఓ ప్రకటన ద్వారా తెలిపింది. దాదాపు రూ.2,250 కోట్ల ఈ రిజల్యూషన్ ప్రణాళికకు ఆగస్టు 14న ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. తదుపరి ఆర్బీఐ, సీసీఐ నుంచి అనుమతులు లభించాయి. మొత్తం 45 రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి అయినట్లు ఐఎన్ఎస్సీఓ పేర్కొంది.
హెచ్ఎన్జీఐఎల్ని పరిష్కార ప్రక్రియ ద్వారా చేజిక్కించుకున్న మధ్వాని గ్రూప్ కంపెనీ
September 29, 2025
0
Tags