సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు !

Telugu Lo Computer
0


సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. మొత్తం నాలుగు నెలల్లో సుమారు రూ.500 కోట్ల లావాదేవీలు జరిగాయని వారు గుర్తించారు. నిందితులు పిల్లలు లేనివారి నుంచి సుమారు రూ.50 లక్షల వరకు వసూలు చేసి, తమ వద్ద ఉన్న బాలికలను ఇతర కుటుంబాలకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో 25 మంది నిందితులుండగా, వారిలో ఐదుగురు డాక్టర్లు, ఎనిమిది మంది ఇతర కార్యకర్తలు అరెస్టు అయ్యారు. డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలిగా గుర్తించబడింది. ఈడీ ఈ కేసును మనీ లాండరింగ్ చట్టం కింద నమోదు చేసి, అక్రమ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది. కాగా ఈ సృష్టి కేసు సంచలనం తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుమారు 60-70 ఫెర్టిలిటీ సెంటర్ ను తనిఖీ చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)