టెస్లా ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా లాంచ్ చేసింది. ఎన్నో అంచనాలతో భారత విపణిలోకి అడుగుపెట్టిన టెస్లాకు నిరాశే ఎదురైంది. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదని సమాచారం. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 600 బుకింగ్స్ మాత్రమే వచ్చాయి. కంపెనీ అంచనాల కంటే ఇవి చాలా తక్కువ. ఎందుకంటే టెస్లా ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లోనే ఇన్ని కార్లను విక్రయిస్తుంది. దీంతో భారత్లో టెస్లాకు అనుకున్నంత స్పందన రాలేదని కంపెనీకి చెందిన కీలక వ్యక్తులను ఊటంకిస్తూ బ్లూమ్బర్గ్ వెల్లడించింది. టెస్లా భారత్లో ఈ ఏడాది 350 నుంచి 500 కార్లను డెలివరీ చేయాలని ప్లాన్ చేసుకుంది. ఇందు కోసం మొదటి బ్యాచ్ షాంఘై నుంచి ఈ నెల మొదట్లో భారత్కు చేరుకోవచ్చని సమాచారం. ఈ వాహనాల డెలివరీలను ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, పుణే, గురుగ్రామ్ నగరాలకే పరిమితం చేయాలని కంపెనీ భావిస్తోంది. పూర్తి చెల్లింపుల తర్వాతే కార్లను డెలివరీ చేయనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన 'వై' మోడల్ కార్లను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. రియర్-వీల్ డ్రైవ్, లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లో ఆశించిన స్థాయిలో లేని టెస్లా కార్ల బుకింగ్స్
September 02, 2025
0
Tags