తిరుమలలో భక్తులకు కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు !

Telugu Lo Computer
0


తిరుమలలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శేషాచల కొండలపై దట్టమైన పొగమంచు పేరుకుపోయింది. దీంతో ఘాట్​ రోడ్​ పై వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళుతున్నారు. శ్రీవారి ఆలయం చుట్టూ అలుముకున్న పొగమంచు భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ కూల్​ వెదర్​ను ఎంజాయి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​ లో ఎండ, ఉక్కపోతకు జనాలను అల్లాడుతుంటే.. తిరుమలకు వచ్చిన భక్తులు మంచు తెరల వాతావరణంలో సేద తీరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)