పార్లమెంటులో మోడీకి వోట్ చోర్.. గద్దీ ఛోడ్.. నినాదాలతో ఆహ్వానం పలికిన విపక్ష సభ్యులు

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న క్రమంలో హౌస్ లోకి ప్రవేశించగానే విపక్ష సభ్యులు లేచి నిలిచొని వెల్ కమ్ చెప్పారు. వోట్ చోర్...  గద్దీ ఛోడ్... అంటూ మోడీకి ఆహ్వానం పలికారు. చప్పట్లు కొడుతూ నినాదాలు ఇస్తూ మోడీని వ్యంగ్యంగా ఆహ్వానించారు. వోట్ చోర్.. గద్దీ ఛోడ్ అంటే ఓట్ల దొంగ.. కుర్చీ దిగిపో.. అనే అర్థంలో ఎంపీలు స్లోగన్స్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విపక్ష ఎంపీల స్లోగన్స్ తో సభలో గందరగోళం నెలకొంది. అధికార సభ్యులు విపక్ష సభ్యులకు కౌంటర్ గా అరవటంతో సభలో మొత్తం గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎన్నికల కమిషన్ తో కలిసి ఓట్ల దొంగతనానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఉన్న ఓట్లు తొలగించి, లేని ఓట్లను యాడ్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందారని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శిస్తూ వస్తున్నారు. బీజేపీకి ఈసీ లబ్ది కలిగించిందని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలలో ఓట్ల చోరీకి పాల్పడి ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆరోపించారు. అందుకు ఉదాహరణగా బెంగళూర్ లోని మహదేవ్ పుర అసెంబ్లీ సెగ్మెంట్ సర్వే చేసి ఓట్ల చోరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఇవేనంటూ రాహుల్ బయటపెట్టారు. ఇంటి నెంబర్ జీరో ఉన్న ఓటర్లు, తండ్రి పేరు లేకుండా కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ తో కూడిన ఓటర్లు, ఒక్క గది ఉన్న ఇంట్లో 40, 80 మంది ఓటర్లు ఉండటం మొదలైన ఆధారాలను రాహుల్ చూపారు. చివరి అర గంటలో ఓటింగ్ శాతం పెంచి అక్రమంగా గెలుపొందారని ఆరోపించారు. బీహార్ లో కూడా అదే చేస్తున్నారని.. SIR పేరున బీజేపీకి ఓటు వేయరని భావించిన ఓటర్లను లిస్టు నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. పార్లమెంటులో SIR పైన చర్చ జరపాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)