సింధూ నదిపై కొత్తగా కట్టే డ్యామ్ ను 10 మిసైళ్లతో నేలమట్టం చేస్తాం !

Telugu Lo Computer
0


మెరికా  సెంట్రల్‌ కమాండ్‌ కమాండర్‌ జనరల్‌ మైఖేల్‌ కురిల్లా పదవీవిరమణ కార్యక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ పాల్గొన్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన బ్లాక్ టై డిన్నర్ లో అసిమ్ మునీర్ పాల్గొన్నారు. భారత్ తో భవిష్యత్తులో మీకు యుద్ధం ముప్పు పొంచి ఉందా..? అని ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తమకు భారత్ నే కాదు, సగం ప్రపంచాన్ని ధ్వంసం చేసే శక్తి ఉందని అన్నారు. అలాగే పాకిస్థాన్ కు నీరు వెళ్లకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై అసిమ్ మునీర్ మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని, ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూస్తామని, పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నాలుగు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పాకిస్థాన్ కోల్పోయిన నష్టాల్ని తాము ప్రజల ముందు బహిర్గతం చేశామని, ప్రపంచం ముందు వెల్లడించామన్నారు. కానీ భారత్ కూడా తమకంటే భారీగా నష్టపోయిందని, కానీ ఆ దేశ ప్రజల ముందు దాన్ని బహిర్గతం చేయలేదని.. రాజకీయ అంశాలతో ఇలా చేశారని మండిపడ్డారు మునీర్. అలాగే పాకిస్థాన్ రాజకీయాల్లోకి మిలిటరీ ప్రమోయం ఉందా అన్న ప్రశ్నకు రాజకీయాలను కూడా రాజకీయ నాయకులకే వదిలేయాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)