ఉత్తరప్రదేశ్ లో బైక్‌ను భయంకరంగా ఢీకొన్న ఘటనలో బైకర్ మృతి

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని బారాబంకీ ప్రాంతంలో అయోధ్య లక్నో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం సిసిటివి కెమెరాలో రికార్డు కాగా, ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ప్రకారం ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి రోడ్డు డివైడర్ దగ్గర రోడ్డు దాటడానికి వేచి ఉన్నాడు. అప్పుడు ఆ మార్గంలో వేగంగా వచ్చిన ఒక కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి పైకి ఎగిరి కారు ముందు భాగంలో పడి ఆ తర్వాత వాహనం కింద చిక్కుకొని మరణించాడు. అతను కారు కింద చిక్కుకున్న తర్వాత చాలా కిలోమీటర్ల దూరం అలాగే లాక్కెళ్లబడ్డాడు. వెంటనే వాహనదారులు ఆ కారును ఆపి, కారును తిరగేసి అతన్ని బయటకు తీశారు, కానీ అప్పటికే అతను మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్‌ను అరెస్టు చేయడమే కాకుండా అతని వద్ద విచారణ జరుపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)