పార్లమెంట్‌ క్యాంటీన్‌లో చిరుధాన్యాలతో చేసే వంటకాలకు ప్రాధాన్యం!

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఎంపీలు ఆరోగ్యకరమైన, తక్కువ క్యాలరీలతో కూడిన పోషకాహారాన్ని ఆస్వాదించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన హెల్దీ మెనూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచనలతో రూపుదిద్దుకుంది. ఈ కొత్త జాబితాలో చిరుధాన్యాలతో చేసే వంటకాలకు ప్రాధాన్యం లభించింది. ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌, పోషణ్‌ అభియాన్‌, ఈట్‌ రైట్‌ ఇండియా వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు అనుగుణంగా ఈ మెనూను తయారయింది. ప్రతి వంటకానికి సంబంధించిన క్యాలరీల వివరాలు అధికారులు మెనూలో పేర్కొన్నారు. ఈ జాబితాలో రాగి ఇడ్లీ, సాంబార్‌, చట్నీ, జొన్న ఉప్మా, చనా చాట్‌, మూంగ్‌ దాల్‌ చిల్లా, ఫైబర్‌ అధికంగా ఉండే జొన్న, బార్లీ సలాడ్‌, వెజిటెబుల్‌ సూపులు ఉన్నాయి. అలాగే మాంసాహరుల కోసం గ్రిల్డ్‌ చికెన్‌, ఫిష్‌ అందుబాటులో ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)