పంజాబ్ మొహాలీ జిల్లాలోని జిరక్పూర్ లోని చండీగఢ్-అంబాలా జాతీయ రహదారి దగ్గర ఓ సెలూన్ లో పని చేసే పదహారేళ్ల అమ్మాయి తన పని ముగించుకుని ఆటో రిక్షా కోసం వెయిట్ చేస్తున్న బాధితురాలిని వీఐపీ రోడ్డులోని మెట్రో మాల్ సమీపంలో ఇద్దరు యువకులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. బాధితురాలిని కారులోకి బలవంతంగా లాగి ఎత్తుకెళ్లారు. ఆమె సోదరుడి పేరును ప్రస్తావిస్తూ ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా జిరక్పూర్, చండీగఢ్ లోని ట్రిబ్యూన్ చౌక్, మొహాలీ ఫేజ్ 11లోని అటవీ ప్రాంతం గుండా కారులో తిప్పుతూ.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన స్థలం సమీపంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పుకుంది. దీంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జిరక్పూర్ పోలీసులు పోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు బాధితురాలి అడ్వకేట్ మల్కిత్ కౌర్ పోలీసులు కేసును తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వైద్య పరీక్షల్లో ఆలస్యం చేశారని, బాధితురాలి తల్లిని మెడికల్ ఎగ్జామినేషన్ సమయంతో ఆమెతో ఉండనివ్వలేదని ఆరోపించడం గమనార్హం.
కారులో మైనర్ బాలికపై అత్యాచారం
July 27, 2025
0
Tags