'ఎక్స్‌' సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా

Telugu Lo Computer
0


'ఎక్స్‌' సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా చేశారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్‌' ఖాతాలో పోస్టు పెట్టారు. ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి 'ఎక్స్‌' (అంతకముందు ట్విటర్‌) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం విశేషం. తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్‌వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. 'ఎక్స్‌' బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు 'xAI'తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు. xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok అనే చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్‌ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)