కేంద్ర జూ అథారిటీ ఆఫ్ ఇండియా నైట్ సఫారీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో కూడా రాత్రి సఫారీ పునఃప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలో ఉన్నా, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నైట్ సఫారీ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు. రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకూ కొనసాగుతుంది. దీనిలో ముఖ్యంగా నిశాచర జంతువులను ప్రత్యక్షంగా చూడొచ్చు. రోజులో చురుకుగా కనిపించని జంతువులు రాత్రి తమ సహజ జీవితాన్ని ఎలా గడుపుతాయో వీక్షించే అవకాశం కలుగుతుంది. నెహ్రూ జూ పార్క్ 1963లో ప్రారంభమై, మిర్ ఆలం ట్యాంక్ పక్కన విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇందులో 2,240 జంతువులు ఉన్నాయి. ఇందులో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి విభిన్న జాతుల జీవులు నివసిస్తున్నాయి. సహజ వాతావరణానికి దగ్గరగా ఉండే ఈ జూ, వలస పక్షులను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. నైట్ సఫారీ ప్రారంభం వల్ల సందర్శకులకు ప్రత్యేకమైన అనుభూతి కలగనుంది. హైదరాబాదీలకు ఇది శుభవార్తే. జంతు ప్రదర్శనలకు కొత్త కొలమానం ఏర్పడనుంది.
నెహ్రూ జూలాజికల్ పార్క్లో రాత్రి సఫారీ పునఃప్రారంభం ?
July 14, 2025
0
Tags