ఒడిశాలో 17 రోజుల్లో 7 అత్యాచారాలు

Telugu Lo Computer
0


బీజేపీ పాలిత రాష్ట్రమైన ఒడిశాలో మహిళలపై లైంగిక దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేవలం 17 రోజుల్లోనే ఏకంగా ఏడుగురు మహిళలు, బాలికలు అత్యాచారానికి గురవడం కలకలం రేపుతుంది. వరుస ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జూలై 1న బర్గఢ్ జిల్లా భలుమారా అడవిలో మేకలు కాస్తున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో భజమాన్ భోయ్, సునంద పిహూ అనే నిందితులను అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)