మాజీ సీఎం విజయ్‌ రూపానీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ

Telugu Lo Computer
0


గుజరాత్ మాజీ సీఎం విజయ్‌భాయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కలిసి పరామర్శించారు. ప్రమాదం నేపథ్యంలో ఇవాళ గుజరాత్ వెళ్లిన ప్రధాని మోడీ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల యోగక్షేమాలు అడిగారు. అనంతరం విజయ్ రూపానీ ఇంటికివెళ్లి కుటుంబసభ్యులతో తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పీఎం మోడీ మాట్లాడుతూ విజయ్‌భాయ్ మన మధ్య లేరనేది ఊహించలేనిదన్నారు. తనకు దశాబ్దాలుగా ఆయన తెలుసని, భుజం భుజం కలిపి తామిద్దరం కలిసి పనిచేశామన్నారు. అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో కూడా విజయ్‌ భాయ్ వినయపూర్వకంగా కష్టపడి పనిచేసేవారని మోడీ అన్నారు. పార్టీ సిద్ధాంతానికి దృఢంగా కట్టుబడి ఉండేవారని, ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వహించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతోశ్రద్ధాశక్తులతో సేవలందించారని మోడీ కొనియాడారు. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అయినా, రాజ్యసభ ఎంపీగా అయినా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా అయినా, క్యాబినెట్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అయినా, ఆయనకు కేటాయించిన ప్రతి బాధ్యతలోనూ ఆయన ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారని మోడీ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)