బాసర గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు దుర్మరణం

Telugu Lo Computer
0

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసర దగ్గర గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిని హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన రాకేశ్‌, వినోద్‌, మదన్‌, రుతిక్‌, భరత్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలకు ఇక్కడికి వచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)