ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపోను లారీ ఢీకొట్టగా ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడటంతో వారిని మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
టెంపోను లారీ ఢీకొట్టిన గతంలో ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
June 30, 2025
0
Tags