మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా, అట్పాడి తహసీల్ లోని నెల్కరంజి గ్రామంలో తక్కువ మార్కులు వచ్ఛాయన్న కారణంగా 16 ఏళ్ల బాలిక తండ్రి చేతిలో హత్యకు గురైంది. తండ్రి ధోండిరామ్ భోసలే (45) ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. తన కుమార్తె 12వ తరగతిలో సాధన పరీక్షలో తక్కువ మార్కులు సాధించిందని ఆవేశానికి లోనయ్యాడు. ఈ విషయంపై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో రాతి గ్రైండర్కు ఉపయోగించే చెక్క హ్యాండిల్ను తీసుకుని భార్య, కుమారుని ఎదుటే కుమార్తెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధిత బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం బహుళ గాయాలే మృతికి కారణం అని అట్పాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ వినయ్ బహిర్ తెలిపారు. పిండి తయారు చేయడానికి ఉపయోగించే రాతి గ్రైండర్ చెక్క హ్యాండిల్ను నిందితుడు పట్టుకుని, అతని భార్య మరియు కొడుకు సమక్షంలో దానితో బాలికపై దాడి చేశాడని అధికారి తెలిపారు.'ఆబాలికను సాంగ్లిలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆమె బహుళ గాయాలతో మరణించిందని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది' అని అట్పాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ వినయ్ బహిర్ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తండ్రిని అరెస్టు చేశారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తక్కువ మార్కులు వచ్చినందుకు తండ్రి చేతిలో కుమార్తె హత్య
June 23, 2025
0
Tags