అమెరికా - ఉక్రెయిన్‌ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారు

Telugu Lo Computer
0


మెరికా - ఉక్రెయిన్‌  మధ్య ఖనిజాల ఒప్పందం కుదిరింది. బుధవారం రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. దీంతో ఉక్రెయిన్​లో ఉండే అరుదైన సహజ వనరులపై అమెరికాకు అనుమతి లభించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ విస్తృత ఆర్థిక ఒప్పందం విలువ దాదాపు బిలియన్ డాలర్లు ఉంటుంది. బుధవారం యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బీసెంట్‌, ఉక్రెయిన్‌ ఫస్ట్‌ డిప్యూటీ ప్రధాని యులియా సిర్దెంకో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే ఖనిజాల తవ్వకాలు, ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక విషయాలపై పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం వల్ల ఉక్రెయిన్‌లో అమెరికా సంయుక్త నిధిని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో అమెరికా పెట్టుబడిదారులకు ప్రాధాన్యత లభించనుంది.దాదాపు మూడేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు అమెరికా పన్నుదారుల డబ్బును చాలా ఉపయోగిస్తారు. ఉక్రెయిన్‌లో ఉండే అల్యూమినియం, గ్రాఫైట్‌, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి ఉంటుంది. తద్వారా అమెరికా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించడానికి ఉక్రెయిన్​కు అవకాశం లభిస్తుందన్నారు. ఆర్థిక ఒప్పందంపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ స్పందిస్తూ ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి కావాల్సిన ఉమ్మడి పెట్టుబడి నిధిని స్థాపించడానికి రెండు దేశాలు సంతకాలు చేశాయని తెలిపింది. స్వేచ్ఛాయుత, సార్వభౌమ, సంపన్నమైన ఉక్రెయిన్‌ కోసం ట్రంప్‌ నిబద్ధతను ఈ చరిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్యం సూచిస్తుందని ఎక్స్​లో పోస్ట్​ చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)