ఒడిశాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసుకు సంబంధించి భువనేశ్వర్కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. ఏడాదిన్నరగా రఘువంశీ భువనేశ్వర్ జోనల్ కార్యాలయంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని అరెస్ట్ చేసిన అధికారులు భువనేశ్వర్లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు.
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఈడీ డిప్యూటీ డైరెక్టర్
May 30, 2025
0
Tags