ఎస్‌బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై ఆర్బీఐ భారీ జరిమానా విధింపు ?

Telugu Lo Computer
0


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలు పాటించలేదనే కారణంతోజరిమానా విధించింది.ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, నిర్దేశించిన మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండేలా ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.బ్యాంకుల రుణాలు, అడ్వాన్స్‌లు, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన అంశాలు, కరెంట్ అకౌంట్‌ ఖాతాలు ఓపెన్‌ చేయడంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దాంతో ఎస్‌బీఐకి రూ.1.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1 కోటి జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఈ జరిమానాలు బ్యాంకింగ్ రంగంలో మరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యగా పని చేస్తాయని పేర్కొంది. రెగ్యులేటరీ నిబంధనల అమలు ఆర్థిక సంస్థలపై ఆర్‌బీఐ కఠినమైన పర్యవేక్షణను ప్రతిబింబిస్తుంది. అంతర్గత నియంత్రణలను బలోపేతం చేయడానికి, కస్టమర్ రక్షణ యంత్రాంగాలను మెరుగుపరచడానికి బ్యాంకులను ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు ఇతర బ్యాంకులకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయని కొందరు భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)