ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వెళ్లిన యువకుల్లో 11 మంది స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో ఎనిమిది మంది గల్లంతుకాగా, ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేశ్, రాజేశ్, రోహిత్, మహేశ్గా గుర్తించారు.
గోదావరి నదిలో ఎనిమిది మంది యువకులు గల్లంతు
May 26, 2025
0
Tags