ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్రెడ్డికి క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కేసులో ముందస్తు బెయిల్కు దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసుస్టేషన్లో ఫిబ్రవరి నెలలో కాకాణిపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర ఆరోపణలపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం కాకాణి గోవర్ధన్రెడ్డి పరారీలో ఉన్నారు.
కాకాణి గోవర్ధన్రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
May 16, 2025
0
Tags