* అమెరికా నుంచి దిగుమతులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రామికశక్తిలో 45.76 శాతంగా ఉన్న రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?
* రైతులకు మద్దతును అందించడానికి కనీస మద్దతు ధర చట్టబద్ధతలో మార్పులను ప్రభుత్వం ఇప్పుడైనా పరిశీలిస్తుందా?
* అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ డంపింగ్ యార్డ్గా మారకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?
* విదేశీ ఉత్పత్తుల నుండి పెరిగిన పోటీ కారణంగా ప్రభావితమయ్యే ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు చేస్తోంది?
* భారత జీడీపీపై పరస్పర సుంకాల ప్రభావం ఏమిటి?
తమ దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. అమెరికా దిగుమతులపై ఏ దేశాలు సుంకాలు వసూలు చేసినా తిరిగి ఆయా దేశాలపై సుంకాలు వసూలు చేస్తామని అన్నారు. అలాగని ఎక్కువ తక్కువ కాకుండా.. ఆయా దేశాలు మాకు ఎంత సుంకం విధిస్తుందో దానికి తగ్గట్లే తాము విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది వాణిజ్య యుద్ధం కాదని అన్నారు. ఇక, ఈ పరస్పర పన్నుల విధానంలో భారత్కు ఎలాంటి మినహాయింపు లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.