అమెరికాలో అనితా దామోదరన్ అనే ఇండియన్-అమెరికన్ పీడియాట్రిషియన్ తన పెంపుడు కుక్క బెట్టీని దారుణంగా హింసించింది. బెట్టీ అనే పోర్చుగీస్ వాటర్ డాగ్ను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి, బాత్టబ్లో దాచిపెట్టింది. ఆమె అపార్ట్మెంట్ను శుభ్రం చేస్తుండగా క్లీనింగ్ సిబ్బందికి బెట్టీ కనిపించింది. ఆ సమయంలో బెట్టీ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోయేలా ఉంది. దామోదరన్ అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. క్లీనింగ్ సిబ్బంది రెండు పెట్టెలను తొలగిస్తుండగా, వారికి ఒక స్టోరేజ్ బిన్ కనిపించింది. దాని మూత కొంచెం తెరిచి ఉంది. సడన్గా ఒక చిన్న పాదం బయటకు వచ్చింది. మొదట వారు అది స్టఫ్డ్ బొమ్మల పెట్టె అని అనుకున్నారు. కానీ మూత పూర్తిగా పడిపోగానే, వారికి బెట్టీ కనిపించింది. చాలా బలహీనంగా, నిర్జీవంగా ఉన్న కుక్క వారిని చూస్తూ ఉండిపోయింది. అధికారులు చెప్పిన ప్రకారం, బెట్టీకి ఒత్తిడి వల్ల పుండ్లు, మూత్రం వల్ల చర్మం కాలడం, విపరీతంగా చిక్కుబడిన బొచ్చు ఉన్నాయి. బహుశా అది తన సొంత వ్యర్థాలను తిని బతికి ఉండవచ్చు. పోలీసులు విడుదల చేసిన ఫొటోలలో బెట్టీ ఎంత దయనీయ స్థితిలో ఉందో స్పష్టంగా కనిపించింది. అయితే, రక్షించచిన తర్వాత అది ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న ఫోటో కూడా ఉంది. చికాగో పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత, దామోదరన్ను 2024, డిసెంబర్లో ఫ్లోరిడాలో అరెస్టు చేశారు. తరువాత ఆమెను ఇల్లినాయిస్కు తరలించారు. ఇటీవల కోర్టు విచారణలో ఆమెను కస్టడీలో ఉంచాలనే అభ్యర్థనను తిరస్కరించారు. కానీ, ఆమె ఇల్లినాయిస్లోనే ఉండాలని, రాత్రి 12 గంటల కర్ఫ్యూ పాటించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 14న ఆమె మళ్లీ కోర్టుకు హాజరుకానున్నారు. జంతు హక్కుల కార్యకర్తలు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. డజనుకు పైగా కార్యకర్తలు విచారణకు హాజరయ్యారు, బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. మరోవైపు, బెట్టీ పూర్తిగా కోలుకుంది, ఇప్పుడు సురక్షితమైన ఇంటిలో నివసిస్తోంది.
అమెరికాలో పెంపుడు కుక్కను హింసించినందుకు ఇండియన్ డాక్టర్ అరెస్టు !
February 12, 2025
0
Tags