పవన్‌కల్యాణ్‌ను కలిసిన రాజేంద్రప్రసాద్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌  కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలు చర్చించుకొన్నారు. మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ను ఆయన సన్మానించారు. రాజేంద్ర ప్రసాద్‌ను పవన్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)