ఆఫ్రికాలో బంగారు గని కుప్పకూలి 48 మంది మృతి ?

Telugu Lo Computer
0


ఫ్రికాలో బంగారు గని కుప్పకూలిన ఘటనలో 48 మంది మృతి చెందారు. ఆఫ్రికాలోని మాలిలో ఎక్కువగా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఇక్కడ అనేక ప్రాంతాల్లో అక్రమంగా బంగారు గనుల తవ్వకాలు జరుగుతుంటాయని స్థానిక అధికారులు చెప్పినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ వెల్లడించింది. శనివారం కూలిపోయిన గోల్డ్ మైన్స్ కూడా అక్రమంగా జరుగుతున్న మైనింగ్ గానే అధికారులు గుర్తించారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ మైనింగ్‌కు మాత్రం అడ్డు కట్ట వేయలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో 48 మంది చనిపోయినట్లుగా స్థానిక కెనీబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ నిర్ధారించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)