రిటర్న్ టికెట్లు లేవన్న కారణంతో దిగిన వెంటనే భారత దంపతులను వెనక్కి పంపిన అమెరికా అధికారులు !

Telugu Lo Computer
0


మెరికాలో తమ పిల్లలను చూసేందుకు వచ్చిన భారతీయ దంపతులకు రిటర్న్ టికెట్లు లేవన్న కారణంతో నెవార్క్ విమానాశ్రయంలో అధికారులు ప్రవేశం నిరాకరించారు. ఐదు నెలల పాటు ఇక్కడే ఉండాలనే ఆలోచనతో ఈ జంట బీ-1/బీ-2 విజిటర్ వీసాలపై అమెరికాకు వెళ్లారు. అయితే 2025 నిబంధనల ప్రకారం రిటర్న్ టికెట్ తప్పనిసరి అని ఇమ్మిగ్రేషన్ అధికారులు వారికి చెప్పారు. ఆ విషయం తమకు తెలియదని సదరు భారతీయ దంపతులు స్పష్టంగా చెప్పారు. కానీ ఎంత విన్నవించినా, వివరణ ఇచ్చినా ఆ తల్లిదండ్రులను విమానాశ్రయం నుంచి నేరుగా భారత్​కి పంపించేసినట్టు తెలుస్తోంది. ఈ కొత్త రూల్​ గురించి యూఎస్ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేనందున ఈ పరిణామం చాలా మంది భారతీయ ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. ఊహించని విధంగా ఈ నిబంధనను అమలు చేయడం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 2025 రూల్స్​ అంటూ ఎంట్రీని నిరాకరించారు. అయితే, ఈ మార్పులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదా బహిరంగ సమాచారం లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి, ఆవేదనకు, ఆందోళనకు గురిచేస్తోంది. భారతీయ దంపతులను ఎయిర్​పోర్ట్​లో దిగిన వెంటనే వెనక్కి పంపించేశారన్న వార్త ప్రవాస భారతీయులు, అమెరికాకు వచ్చే సందర్శకుల్లో ప్రమాద ఘంటికలు మోగించింది. ఎయిర్​పోర్ట్​ ఎంట్రీల్లో ఇంకేం ఊహించని చర్యలు అమలు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)