కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి లోక్ సభ ఎన్నికల్లో మాండ్య లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మాండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని వెల్లడించారు. మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో 2 దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో పోలింగ్ జరుగనుంది. కర్ణాటక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జేడీఎస్లు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జేడీఎస్కి పోటీ చేసేందుకు మూడు లోక్ సభ నియోజకవర్గాలు కేటాయించారు.
లోక్సభ ఎన్నికల బరిలో హెచ్డీ కుమారస్వామి !
March 26, 2024
0
Tags