జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు కోర్టు ఈడీ కస్టడీ పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఇప్పటికే ఐదు రోజుల పాటు హేమంత్ను ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. తాజాగా మరోసారి ఈడీ అభ్యర్థన మేరకు ఇంకో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీ పొడిగించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్ను ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు బుధవారం ఐదు రోజుల పాటు పొడిగించినట్లు న్యాయవాదులు తెలిపారు.
హేమంత్కు ఈడీ కస్టడీ ఐదు రోజులు పొడిగింపు
February 07, 2024
0
Tags