రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో 'భారత్ జోడో న్యాయ యాత్ర'ను మణిపూర్లో ప్రారంభించి ముంబయి వరకు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఈ యాత్ర ప్రారంభం కాకముందే కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవానికి ఈ యాత్ర ప్రారంభించాలని అనుకున్న చోట మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. ఈ యాత్ర జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. కానీ ఇప్పటికీ అనుమతి లేకపోవడంతో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె మేఘచంద్ర, పార్టీ నాయకుల బృందంతో కలిసి బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ను కలిశారు. ఆ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సాకుగా చూపుతూ భేటీ సందర్భంగా సీఎం అనుమతి నిరాకరించారని ఆయన చెప్పారు. యాత్రను తమ ప్రభుత్వం అనుమతించదని సిఎం ఎన్ బీరెన్ సింగ్ అన్నారని కె మేఘచంద్ర వెల్లడించారు. మణిపూర్ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. ఇది రాజకీయ ప్రయత్నం కాదని, యాత్రను రాజకీయం చేయొద్దని అన్నారు. రాహుల్ గాంధీ రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్లడం లేదని, శాంతి సందేశం ఇవ్వబోతున్నారని చెప్పారు. అక్కడ అనుమతించకపోతే వేరే ప్రదేశానికి వెళ్తామని, మరో ప్రదేశానికి వెళ్లేందుకు సీఎం అనుమతి ఇచ్చి ఉండవచ్చని అన్నారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు 6,500 కిలోమీటర్ల మేర సాగే ఈ చారిత్రాత్మక యాత్రలో యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు కెసి వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్లోని ఇంఫాల్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర దేశంలోని 15 రాష్ట్రాల గుండా ముంబయిలో ముగుస్తుంది. ఇప్పుడు ఈ యాత్ర మార్గంలో అరుణాచల్ ప్రదేశ్ కూడా చేర్చబడింది.
రాహుల్ గాంధీ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరణ !
January 10, 2024
0
Tags